కంది
శంకరయ్య గారి ‘శంకరాభరణం’ బ్లాగ్
లో ఇచ్చిన సమస్య
‘సజ్జనులు చేరుదురు
యమసదనమునకు’
‘మంచివారు
యమలోకానికి వెళతారు' అనేది ఇఛ్చిన సమస్య.
చెడ్డవారి స్నేహం
చేసి, మేక వన్నె పులులలాంటి వ్యక్తుల మోసానికి బలై, చేయని నేరానికి శిక్ష అనుభవించడానికి
మంచివారు యమలోకానికి
వస్తారు అని 'తేటగీతి' లో సమస్య పూరించాను
చెడ్డమనుజులజతకట్టి చేయుకలిమి
మేక వన్నెపులులమోసముకనబడక
నేరమును చేయకున్ననుశిక్షపడగ
సజ్జనులు చేరుదురు యమసదనమునకు